నవతెలంగాణ – రాంచీ: ఝార్ఖండ్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను బెంగళూరు -భాగల్పూర్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం. అనసోల్ పరిధి జంతారా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన సిబ్బంది ఘటనాస్థలానికి వైద్య బృందాలను, అంబులెన్స్లను తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.