మిర్యాలగూడలో విషాదం… యువతీ యువకులు ఆత్మహత్య


నవతెలంగాణ మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం చోటుచేసుకుంది. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని 115 మైలు వద్ద ట్రాక్ పై రైలు కింద పడి యువతి, యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. రైల్వే సిబ్బంది సమాచారంతో ఘటన స్థలానికి చేరుకొని అధికారులు మృతదేహాలను పరిశీలించారు. మృతుల వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతీ యువకులు భార్యాభర్తలా లేక ప్రేమికులా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love