- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సైబర్ నేరాలపై శ్రీలంక ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా గాలే, హిక్కదువా, మిదిగమ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దాదాపు 200 మంది విదేశీయులను అరెస్టు చేయగా.. వారిలో 173 మంది భారతీయులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. పర్యాటక వీసాల గడువు ముగిసినా దేశంలోనే ఉండి ఉద్యోగాలు చేయడం, సైబర్ నేరాల చట్టాల పరిధిలోకి వచ్చే కార్యకలాపాలకు పాల్పడటం వంటి అభియోగాలను వారిపై మోపనున్నట్లు తెలిపారు.
- Advertisement -



