హైదరాబాద్ : ప్రపంచ బాక్సింగ్ చాంపియన్, భారత స్టార్ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్ల భారీ నగదు ప్రోత్సాహకం ప్రకటించింది. ఇటీవల ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్స్లో పసిడి పతకం సాధించిన నిజామాబాద్ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ రానున్న పారిస్ ఒలింపిక్స్ పసిడి ఫేవరేట్లలో ఒకరు!. ఒలింపిక్స్ సన్నద్ధత, ఇతర ఖర్చుల నిమిత్తం నిఖత్కు రూ.2 కోట్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ శాంతి కుమారిని సిఎం ఆదేశించారు. ప్రపంచ చాంపియన్గా నిలిచిన నిఖత్ జరీన్ను గురువారం రాష్ట్ర సచివాలయంలో సిఎం కెసిఆర్ అభినందించారు. కార్యక్రమంలో మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి సహా శాట్స్ చైర్మెన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.