వాహనాల తనిఖీల్లో 2 లక్షల 53 వేల 460 రూపాయలు జప్తు 

నవతెలంగాణ- రామగిరి 
రామగిరి మండలంలోని పన్నూర్ చౌరస్తా వద్ద రామగిరి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎన్నికల కోడ్ ప్రకారం ఎటువంటి ఆధారాలు లేకుండా ముత్తారం మండలం లక్కారం గ్రామానికి చెందిన గుర్రం మధుకర్ అను వ్యక్తి వద్ద పరిమితికి మించి 2, లక్షల  53, వేల 460/- రూపాయల నగదు ఉన్నందున అట్టి డబ్బులను స్వాధీన పరుచుకుని  జప్తు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై కటిక రవి ప్రసాద్ మాట్లాడారు.ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై  చట్టపరమైన చర్యలు తీసుకోవడం  జరుగుతుందని, అలాగే  జప్తు చేసిన డబ్బులను సంబంధిత పై అధికారులకు పంపిస్తున్నామని ఆయన అన్నారు. ఆయన వెంట కానిస్టేబుల్ రాజు, ఇతర కానిస్టేబుళ్లు హోంగార్డు గోపాల్, తదితరులు ఉన్నారు.
Spread the love