నిర్వహణ పనులతో 24 రైళ్లు రద్దు

Trainనవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డివిజన్లలో లైన్లకు సంబంధించిన పనుల కారణంగా 24 రైళ్లును రద్దు చేశారు. ఈ రైళ్లు వారంరోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. పలు రైళ్లను 17-23 వరకు, మరికొన్నింటిని 18-24 వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. రద్దయిన రైళ్లలో కాజీపేట-డోర్నకల్‌, విజయవాడ-డోర్నకల్‌, సికింద్రాబాద్‌-వికారాబాద్‌, కరీంనగర్‌-సిర్పూర్‌టౌన్‌, కరీంనగర్‌-నిజామాబాద్‌, బల్లార్ష-కాజీపేట, కాచిగూడ-నిజామాబాద్‌ తదితర రైళ్లున్నాయి.

Spread the love