జూరాలకు 2,451 క్యూసెక్కుల నీరు

– తాగునీటి కోసం నారాయణపూర్‌ డ్యామ్‌ నుంచి విడుదల
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
గద్వాల తాగునీటి అవసరాల కోసం కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్‌ డ్యామ్‌ నుంచి విడుదల చేసిన నీళ్లు గురువారం ఉదయం జూరాల డ్యామ్‌కు చేరుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వినతి మేరకు కర్ణాటక 1.09 టీఎంసీల నీటి విడుదలకు సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నారాయణపూర్‌ డ్యామ్‌ నుంచి నీటిని విడుదల చేయగా.. గురువారం జూరాల ప్రాజెక్టుకు 2,451 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. అలాగే అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో ఆ నీరు కూడా తోడవ్వడంతో జూరాలకు అధిక మొత్తంలో ప్రవాహం వస్తోంది.

Spread the love