– వీల్చైర్లో కూర్చుని నామినేషన్
నవ తెలంగాణ -దుబ్బాక
కత్తి దాడికి గురై కొద్దిరోజులుగా హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గురువారం నామినేషన్ వేయడానికి సిద్దిపేట జిల్లా దుబ్బాకకు అంబులెన్స్లో వచ్చారు. అక్కడ వీల్చైర్లో కూర్చుని ఐఓసీలోని ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో మంత్రి హరీశ్రావు, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ర్యాలీలో ఎంపీ ప్రభాకర్రెడ్డి అంబులెన్స్లోనే కూర్చొని కార్యకర్తలకు, ప్రజలకు అభివాదం చేశారు. మంత్రి హరీశ్రావు ర్యాలీని ముందుకు నడిపిస్తూ ప్రభాకర్రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.