సిగరేట్ పీకతో 44 వాహనాలు దగ్ధం

నవతెలంగాణ – సంగారెడ్ది: సిగరేట్ పీకలతో 44 వాహనాలు కాలిపోయిన ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఠాణా పరిధిలో జరిగింది. ఠాణాలో వివిధ కేసుల్లోని వాహనాలు ఉంచగా.. చుట్టుపక్కల పిచ్చిమొక్కలు పెరిగి ఎండిపోయాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఆకతాయిలు సిగరెట్లు కాల్చి పిచ్చిమొక్కల్లో విసిరారు. మంటలు అంటుకుని 36 బైక్లు, 8 కార్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు.

Spread the love