రామారెడ్డి కళాశాలలో 5% ఉత్తీర్ణత

నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం వెలుబడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 95 మంది విద్యార్థులకు గాను 5 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 101 మంది విద్యార్థులకు 5 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కళాశాలలో 5% ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ మధు శ్రీవాత్సవ ఒక ప్రకటనలో తెలిపారు.
Spread the love