జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేట్‌ పాఠశాలలో 50శాతం రాయితీ

నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
వికారాబాద్‌ జిల్లాలో పనిచేస్తున్న జర్నలి స్టుల పిల్లలకు ప్రయివేట్‌ పాఠశాలల్లో 50శాతం ఫీజు రాయితీతో విద్య అందించాలని విద్యాధికా రిని రేణుకాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 30న టీయూడబ్ల్యూజే(ఐజేయు) వికారాబా ద్‌ జిల్లా నాయకులు జిల్లా విద్యాధికారిని రేణుకా దేవికి వినతిపత్రం అందేశారు. దీనికి స్పందిం చిన ఆమె జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ప్రయివేట్‌ పాఠశాలలో 50 శా తం రాయితీతో జర్నలిస్టు పిల్లలకు విద్యను అం దించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సం దర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్‌ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన ధ్యేయమని అన్నారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి, డీఈఓ రేణుకాదేవికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా నాయకులు చుక్కయ్య పాల్గొన్నారు.

Spread the love