రూ.80 వేలు నగదు స్వాధీనం

నవతెలంగాణ – అశ్వారావుపేట : అధారాలు లేకుండా తీసుకెళ్తున్న నగదును పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆంధ్రప్రదేశ్,జంగారెడ్డి గూడెం కు చెందిన రంగా ప్రసాద్ దగ్గర ఎస్.ఐ శ్రీకాంత్ రూ.80 వేలు నగదును గుర్తించారు.ఆయన జంగారెడ్డిగూడెం నుండి కారు లో హైద్రాబాద్ వెళుతున్నాడు.పట్టుబడిన నగదు కు ఆధారాలు చూపక పోవటంతో సీజ్ చేసినట్లు ఎస్.ఐ తెలిపారు.
Spread the love