- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
ఇందిరమ్మ ఇల్లు నిరుపేదలకే అందాలని మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల సురేష్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో మైనార్టీ బహుజనులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి అన్నారు. ఇందిరమ్మ ఇల్లు కేవలం నిరుపేదలకే అందించాలన్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు అర్హులైన పేదలను గూర్చి ప్రతి గ్రామంలో అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మోట్ల సంజీవ్ యూసుఫ్ విజయ్ మనోహర్ నవీన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -