- Advertisement -
నవతెలంగాణ – ధర్మసాగర్
మండల కేంద్రానికి చెందిన శాతబోయిన రమేష్ యాదవ్ తల్లి శాతబోయిన బాలమ్మ, ధర్మాపురం గ్రామానికి చెందిన మునిగాల ఆరోగ్యం, సోమదేవరపల్లి గ్రామానికి చెందిన మాజీ గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపెల్లి అనిల్ తల్లి తాళ్లపెల్లి సరోజన మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇరువురి పార్థివా దేహాలకు వారు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమాలలో వారి వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -