ధాన్యం సేకరణపై అవగాహన సదస్సు
మండల ప్రత్యేక అధికారి జీనుగు మరియాన్న
తాహసిల్దార్ చందా నరేష్
నవతెలంగాణ – నెల్లికుదురు
రైతులకు ఇబ్బంది లేకుండా వారికి అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మండల ప్రత్యేక అధికారి జీనుగు మరియాన్న తహసిల్దార్ చందా నరేష్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ధాన్యం సేకరణ కేంద్రాలలో తూకం, నాణ్యత పరీక్షలు పారదర్శకంగా జరగాలని, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత తక్షణమే చెల్లింపులు జరగేలా చూడాలని అన్నారు.
మండలంలోని ధాన్యం సేకరణ కేంద్రాల ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సీజన్లో 17 కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టు నిర్ణయించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం నరేంద్ర కుమార్, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, జి పి ఓ లు, ట్యాప్ ఆపరేటర్లు సెంటర్ల ఇన్చార్జిలు పాల్గొన్నారు.