నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్ర పోలీసు కంట్రోల్ రూం కు బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపుతోంది.ముంబై నగరంలో రెండు రోజుల్లో భారీ పేలుళ్లు జరుగుతాయని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు మంగళవారం ఉదయం మహారాష్ట్ర పోలీసు కంట్రోల్ రూమ్కు మెయిల్ పంపారు. ఈ హెచ్చరికలను తేలికగా తీసుకోవద్దని అందులో పేర్కొన్నారు. అయితే, అందులో డేట్, టైమ్, ప్లేస్ మెన్షన్ చెయ్యలేదు. ఈ బెదిరింపులతో అప్రమత్తమైన అధికారులు ఈ మెయిల్ను ముంబై పోలీసులకు ఫార్వర్డ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ మెయిల్ను ఎవరు పంపారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రెస్ ద్వారా మెయిల్ పంపిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
మహారాష్ట్ర పోలీసు కంట్రోల్ రూంకు బాంబు బెదిరింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES