Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కల్లుగీత కార్మిక సంఘం జిల్లా, రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

కల్లుగీత కార్మిక సంఘం జిల్లా, రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

- Advertisement -

– కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్
నవతెలంగాణ – భిక్కనూర్
కల్లుగీత కార్మిక సంఘం జిల్లా రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్ అన్నారు. పట్టణ కేంద్రంలోని కల్లు డిపోలో గౌడ సంఘం ఆధ్వర్యంలో కల్లు గీత కార్మిక సంఘం మహాసభల కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్లుగీత కార్మిక సంఘం ఏర్పడి  68 సంవత్సరాలు అవుతుందన్నారు. 1957 లో ధర్మాభిక్షం దాట్ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంఘం దొరలను, భూస్వాములను ఎదిరించి హర్ రాజు మామ్లలను  రద్దు చేయించుకుని సొసైటీలను ఏర్పాటు చేసి చెట్టుపై హక్కు, ఎక్సగ్రె‌షియా పెన్షన్ లాంటి అనేక హక్కులను సాధించుకున్నామని గుర్తు చేశారు.

అనేకమంది నాయకులు ధర్మ బిక్షం ఎస్ ఆర్ దాట్ల  మల్లయ్య తొట్ల మలుసూరు లాంటి అనేకమంది అమరవీరుల స్ఫూర్తితో కల్లు గీత కార్మిక సంఘం దీక్షతో పని చేస్తుందని అలాంటి సంఘం జిల్లా రాష్ట్ర మహాసభలు నవంబర్ 11 న కామారెడ్డి జిల్లా మహాసభ ఉంటుందని ఈ మహాసభ ను జయప్రదం చేయాలన్నారు. నవంబర్ 28 ,29,30 తేది ల్లో రాష్ట్ర మహాసభలు సూర్యాపేట లో ఉంటాయని రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహా సభలో కల్లు గీత వృత్తి రక్షణకై 3 సంవత్సరాలు కాలంలో  ఎలాంటి పోరాటాలు నిర్వహించాలని తిర్మాణాలు జరుగుతాయని, తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత గీత కార్మికుల సంక్షేమానికి అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పోరాటాల ద్వారా తెలియజేస్తూ  కార్మికుల పక్షాన నికరంగా నిలబడి అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు.

వృత్తి రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలను నిర్వహిస్తుందని ఈ పోరాటాల్లో యువత కల్లు గీత కార్మికులు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని ప్రభుత్వం వృత్తిలో ఆధునీకరణ చేపట్టి మార్కెట్ సౌకర్యం కల్పిస్తే  5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన కేరళ రాష్ట్రం  లో కల్లుగీత వృత్తి మీద ఆధునికరణ చేసి లక్షలాది మందికి జీవనోపాధి కలిగిస్తుందని కావున కల్లగీత వృత్తిని రక్షించాలంటే మద్యం తగ్గించి స్వచ్ఛమైన కల్లును ప్రజలకు అందించే విధంగా అధునికరణ చేపట్టాలని మార్కెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం  నాయకులు సిద్దగౌడ్,రవిందర్ గౌడ్ కనక గౌడ్ , స్వామిగౌడ్, కిషన్ గౌడ్, రమేష్ గౌడ్, స్వామి గౌడ్ , సిద్దగౌడ్ రామ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -