- Advertisement -
- – మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ
– సాయి అనే యువకుడు మృతి
నవతెలంగాణ – వరంగల్
ఖిలా వరంగల్ తూర్పు కోట ప్రాంతంలో ఆదివారం అర్ధ రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో స్నేహితుల మధ్య తలెత్తిన గొడవలో సాయి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సహచరులు అతడిని చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాల పాలైన సాయి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న మిల్స్ కాలనీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఘర్షణకు కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నది. సాయి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
- Advertisement -



