నవతెలంగాణ – నవాబు పేట
వైద్య విద్యార్థిని కడావత్ రాజేశ్వరికి లక్ష 35వేల రూపాయలు ఆర్థిక సహాయం మాజీ టీటీడీ బోర్డు సభ్యులు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మన్నే జీవన్ రెడ్డి అందించి తన దాతృత్వాన్ని చాటుకుని నిరుపేద వైద్య విద్యార్థినికి ఆర్థికంగా అండగా నిలిచారు. మహబూబ్నగర్ రూరల్ మండలం మాచన్ పల్లి తండాకు చెందిన కడావత్ రాజేశ్వరి ఎంతో కష్టపడి చదివి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ లో సీటు సాధించింది. ఆమె కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని గిరిజన విద్యార్థి నాయకులు రవీందర్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ నాయకులు మన్నె జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆర్థికంగా చేయూత అందించారు. కళాశాల ఫీజు రూ. లక్ష 35 వేల రూపాయలను ఆన్ లైన్ లో విద్యార్థికి పంపించారు. ఈ సందర్భంగా మన్నే జీవన్ రెడ్డికి రాజేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.గతంలో మన్నే జీవన్ రెడ్డి ఎంతోమందికి వైద్య చికిత్సల కోసం, విద్యార్థుల ఫీజుల కోసం ఆర్థిక సాయం అందజేశారు.
వైద్య విద్యార్థినికి మన్నె జీవన్ రెడ్డి ఆర్థిక చేయుత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



