Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం

జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం

- Advertisement -

ఎస్ఐ, ఏ కమలాకర్, పసర పోలీస్ స్టేషన్ 
నవతెలంగాణ – గోవిందరావుపేట 

జాతీయ ఐక్యత దినోత్సవం (అక్టోబర్ 31) సందర్భంగా, భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయి పటేల్  150వ జయంతి పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పసర ఎస్ఐ ఏ కమలాకర్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్ ఐ కమలాకర్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి, సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యం అని అన్నారు. యువత, ప్రజలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సర్దార్ పటేల్  సేవలు, దేశాన్ని ఏకతా బంధంతో కట్టిపడేసిన ఆయన నాయకత్వం ప్రతి ఒక్కరికీ ప్రేరణ. మనమందరం ఐక్యతతో, స్ఫూర్తితో ముందుకు సాగితేనే దేశం అభివృద్ధి సాధిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సహకారం అందించాలి అన్నారు. సమయం: ఉదయం 06:30 గంటలకు, స్థలం: పస్ర నుండి గోవిందరావుపేట వరకు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది,ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరియు వివిధ సామాజిక సంస్థల సభ్యులు పాల్గొననున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -