రామ్ చరణ్ నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నాయిక జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. వద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. శనివారం మేకర్స్ రెండు డిఫరెంట్ పోస్టర్ల ద్వారా అచ్చియ్యమ్మగా జాన్వీ కపూర్ ఫస్ట్లుక్ను విడుదల చేశారు. రస్టిక్ ప్రింటెడ్ చీర, సంప్రదాయ నగలు, సన్గ్లాసెస్తో స్టైలిష్గా మైక్ ముందు ధైర్యంగా నిలబడి ఉన్న లుక్, అలాగే రెండో పోస్టర్లో బ్లూ చీరలో జీప్పై నిలబడి, ధైర్యంగా అభివాదం చేస్తూ జాన్వీ కనిపిస్తుంది. ఇది ఆమె పాత్రలోని సోషల్ ఇంపాక్ట్ , ఆత్మవిశ్వాసాన్ని చక్కగా ప్రజెంట్ చేసింది. ఫియర్స్ అండ్ ఫియర్లెస్ అనే టైటిల్కి తగినట్లుగా ఈ పోస్టర్లలో జాన్వీ పూర్తిగా మాసీ లుక్తో అందర్నీ ఫిదా చేస్తోంది.
వచ్చే యేడాది మార్చి 27న ఈ సినిమా పాన్-ఇండియా విడుదల కానుంది. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సాన, సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, కో ప్రజెంటర్: ఐవివై ఎంటర్టైన్మెంట్, నిర్మాత: వెంకట సతీష్ కిలారు, సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా, సంగీతం ఏఆర్ రెహమాన్, డీఓపీ : ఆర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా, ఎడిటర్: నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్.
దేనికీ.. భయపడని అచ్చియ్యమ్మ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



