నవతెలంగాణ నకిరేకల్
మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసున్నామని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని పన్నాలగూడెం పెద్ద చెరువులో ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఉచిత చేప పిల్లల ను చెరువు లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్ నియెజకవర్గంలో 223 చెరువుల్లో 1 కోటి 05 లక్షలు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసున్నామన్నారు.ఉచిత చేప పిల్లల పంపిణి కార్యక్రమాన్ని మత్సశాఖ సోసైటి సభ్యులు వినియోగించుకోవాలని కోరారు.
మత్స్యకారులకు వలలు, ఇతర పరికరాలు సబ్సిడీ ద్వారా అందజేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల మాధవ్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత శ్రీనివాస్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మత్సశాఖ అధికారులు, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.



