నవతెలంగాణ – కుభీర్
మండలంలోని ఫార్డి బి గ్రామానికి చెందిన ర్యపాన్ వార్ రుక్మ బాయి (47)మహిళా సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలపిన వివరాలు ప్రకారం.. రుక్మ బాయి ఆదివారం అర్ద రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆపస్మరక స్థితిలో పడి ఉండడంతో వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు బైంసా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి అప్పటికే విషమించడంతో మార్గ మధ్యలో మృతి చెందడం జరిగింది. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు ఒక్క కుమారుడు (వికాలంగుడు) ఉన్నారు. తన కుమారుడిని ఆస్పత్రులకు తీసుకెళ్ళలేక, ఆర్థిక ఇబ్బందులు పడడంతో ఆత్మహాత్య చేసుకోవడం జరిగిందని మృతురాలి తమ్ముడు ప్రకాష్ తెలిపారు. ఆయన ఇచ్యిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏ ఎస్ ఐ లక్ష్మణ్ తెలిపారు.
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



