Wednesday, November 5, 2025
E-PAPER
Homeజిల్లాలుపంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – చండూరు

 చండూరు మండలంలో నిత్యం కురుస్తున్న అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి నష్టం అంచనా వేయాలని బీజేపీ పార్టీ జిల్లా నాయకులు (తెలంగాణ ఉద్యమకారులు) కళ్లెం సురేందర్ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయన బుధవారం చండూరులో విలేకరులతో   మాట్లాడుతూ… కురిసిన అకాల వర్షం కారణంగా వేల ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలన్నారు. తడిసిన వరి ధాన్యాన్ని కటింగ్‌ లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. వడ్లకు నల్లగింజ, తేమ ఉన్నా, రైసుమిల్లర్లు వెనక్కి పంపకుండా కొనుగోలు చేయాలని, పత్తి రంగు మారిన, మ్యాచర్ తో సంబంధం లేకుండా సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి పరిహారం  ఇవ్వాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -