- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్యలతో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ధర్మేంద్ర కన్నుమూశారు. హిందీ సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన నటుల్లో ఒకరిగా పేరుపొందిన ధర్మేంద్ర ఈ లోకం విడిచివెళ్లడంతో బాలీవుడ్ దుఃఖసాగరంలో మునిగిపోయింది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ధర్మేందకు అప్పటి కేంద్రప్రభుత్వం 2012లో పద్మభూషణ్ పురస్కారంతో సన్మానించింది. 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం తీసుకున్నారు.
- Advertisement -



