Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్లు సకాలంలో పూర్తి చేసుకోవాలి: ఎంపీడీవో

ఇందిరమ్మ ఇండ్లు సకాలంలో పూర్తి చేసుకోవాలి: ఎంపీడీవో

- Advertisement -

నవతెలంగాణ – ఊరుకొండ 
ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలని ఎంపీడీవో కృష్ణయ్య అన్నారు. బుధవారం ఇందిరమ్మ ఇండ్ల ప్రగతి పరిశీలనలో భాగంగా మండల పరిధిలోని జగబోయినపల్లి, బాల్యలోక్యాతాండా గ్రామాలను సందర్శించారు. మంజూరైన ప్రతి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పరిశీలించగా, జగబోయినపల్లి గ్రామంలో మొత్తం 14 ఇండ్లు మంజూరు కాగా.. నేటి వరకు బేస్మెంట్ పూర్తి అయినవి ఒక ఇల్లు, గోడలపని నడుస్తున్నవి 8 ఇండ్లు, స్లాబ్ వేయబడినవి ఒక ఇల్లు పాత బెనిఫిషరీలు ఇద్దరు, ఇందిరమ్మ ఇండ్ల నమూనా కొలతలు మించి కట్టుకున్నవారు ఒకరు.. ఇంకా ఇల్లు కట్టుకోవడం ఇష్టం లేక ప్రారంభించనిది ఒకరు ఉన్నట్లు తెలిపారు. జగబోయినపల్లి గ్రామానికి వివిధ దశల్లో పూర్తి అయిన ఇండ్లకు మొత్తం రూ.10.00 లక్షలు విడుదల కాబడినవని తెలిపారు.

అదేవిధంగా బాల్యలోక్యతాండా గ్రామంలో మొత్తం 6 ఇండ్లకు గాను బిలో బేస్మెంట్ లెవెల్  2 ఇండ్లు, బేస్మెంట్ పూర్తి అయినవి 2 ఇండ్లు, గోడలపని పూర్తి అయినవి 2 ఇండ్లు బాల్యలోక్యతాండా గ్రామానికి నేటి వరకు మొత్తం రూ.2 లక్షలు విడుదల అయినట్లు తెలిపారు. వివిధ దశల్లో ప్రగతిలో ఉన్న లబ్ధిదారులు త్వరగా పనులు పూర్తి చేసుకొనుటకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీఓ లక్ష్మణ్ నాయక్,  పంచాయతీ కార్యదర్శులు హరికృష్ణ, మహేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామస్థాయి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -