Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గీతన్నల రణభేరి పోస్టర్, కరపత్రాలు ఆవిష్కరణ

గీతన్నల రణభేరి పోస్టర్, కరపత్రాలు ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి 
కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలంలోని గౌడ గౌడ్ అన్న గీత కార్మిక సభను జయప్రదం చేయాలని వాల్ పోస్టర్లు కరపత్రాలను గురువారం విడుదల  చేశారు. ఈ కార్యక్రమానికి వేలాదిమంది గీత కార్మికులు తరలిరావాలని ( కేజీ కేఎస్ ) కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షలు సైదగౌని వెంకట్ గౌడ్  అన్నారు. కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర 4 వ మహాసభల సందర్భంగా నవంబర్ 28వ తేదీన సూర్యాపేటలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, దీనికి రాష్ట్ర నలుమూలల నుండి గౌడ్ అన్నలు తరలి వస్తున్నారన్నారు. జిల్లా లో గౌడ గీత కార్మికులు వేలాదిగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు  ఈ సందర్భంగా వెంకట్ గౌడ్  మాట్లాడుతూ నవంబర్ 28 న బహిరంగ సభ అనంతరం 29,30 తేదీలలో జరిగే ప్రతినిధుల మహాసభలో రాష్ట్రంలోని గీత కార్మికుల సమస్యలు చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

1957లో రాష్ట్రంలో మొట్టమొదట ఏర్పడ్డ సంఘం కల్లుగీత కార్మిక సంఘం అని  ఈ 68 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించడం జరిగిందన్నారు. సొసైటీలు, టిఎఫ్ టి లు, పెన్షన్, ఎక్సిగ్రేషియా లాంటి హక్కులు సాధనకై తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్న కల్లుగీత వృత్తి గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టింపే లేదన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం గీత కార్మికుల  సంక్షేమానికి ఒక్క పథకం కూడా పెట్టలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ ఇప్పటివరకు అమలు చేయలేదు. అధికారులకు, మంత్రులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 4 వేలకు, ఎక్సిగ్రేషియా 10 లక్షలకు పెంచాలని, ప్రమాద నివారణకు వృత్తి చేసే వారందరికీ జాప్యం లేకుండా కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని, ప్రమాదానికి గురైన గీత కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ ఎక్సిగ్రేషియా వెంటనే విడుదల చేయాలని తెలిపారు.

నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, కల్తీ కల్లు పేరిట అక్రమ దాడులు ఆపాలని, దరఖాస్తు చేసుకున్న వారందరికీ సోసైటిలు,టి ఎఫ్ టి  లైసెన్స్ లు వెంటనే ఇవ్వాలని ప్రతి గ్రామానికి చేట్లు పెంచుకోవడానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని అన్నారు. తదితర  డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమిస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా  ప్రధాన కార్యదర్శి రాజా గౌడ్, బీబీ పెట్ నాయకులు స్వామి గౌడ్, రమేష్ గౌడ్, పరుశురాం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, అంజాగౌడ్, సతీష్ గౌడ్, తిరుపతి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -