- Advertisement -
అన్నారం గ్రామ శివారులో 250 మెట్రిక్ టన్నుల గోదాము
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని అన్నారం గ్రామ శివారులో 250 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి గురువారం భూ పరిశీలన ను మాచారెడ్డి సొసైటీ చైర్మన్ స్వామి గౌడ్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామి గౌడ్ మాట్లాడుతూ…. మాచారెడ్డి సొసైటీ ఆధ్వర్యంలో రైతుల సౌకర్యార్థం గోదాం నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. గోదాం నిర్మాణం తర్వాత రైతులకు ఎరువుల నిలువకు గాని, రైతుల అవసరాలకు పోదాం వినియోగించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో క్లస్టర్ అధికారి షేక్ చాంద్, సీనియర్ అసిస్టెంట్ సయ్యద్ మసీముద్దీన్, సీఈవో చంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.
- Advertisement -



