- Advertisement -
నవతెలంగాణ-పెద్దవూర
నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియా మున్సిపాలిటీ సమీపంలో పెద్దవాగు బ్రిడ్జి మీద సోమవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో మజార్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలై కిందపడిపోయారు. అదే సమయంలో అటువైపు వెళుతున్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి గాయాలైన వ్యక్తిని తన సొంత వాహనంలో హుటాహుటిన హాలియా ఆస్పత్రిలో చేర్పించారు.మజార్ ఆరోగ్యం కుదుట పడాలని డబ్బు ఎంత ఖర్చు అయినా తగ్గేదే లేదు.అతనికి వైద్యచేయాలని డాక్టర్ తో చెప్పారు.
- Advertisement -



