ఆధారాలు లేని నగదు స్వాధీనం 

నవతెలంగాణ – అశ్వారావుపేట : ఎన్నికల నేపధ్యంలో  అశ్వారావుపేట అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ దగ్గర సోమవారం పోలీస్ లు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో ఆధారాలు లేని రూ. 1 లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు.ఆంధ్రప్రదేశ్,తూర్పుగోదావరి జిల్లా,సీతానగరం మండలానికి చెందిన పొలుమూరి వెంకట్రావు సీతానగరం నుండి తెలంగాణ లోని అశ్వారావుపేట కు  కారులో నగదుతో వస్తుండగా పోలీస్ తనిఖీల్లో ఆధారం లేని నగదు గా తేలింది.
దీంతో మంగళవారం ఇద్దరి రూ.4 లక్షల 61 వేయి వంద తో పాటు బుధవారం రూ.2 లక్షల 30 వేల  నగదుతో పాటు సోమవారం వరకు మొత్తం రూ.10 లక్షల 90 వేల 6 వందలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్.హెచ్.ఒ 1 ఎస్.ఐ శ్రీకాంత్ తెలిపారు.
Spread the love