– రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దసరా పండుగ అనేది విజయానికి చిహ్నమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దీనికి తెలంగాణ సాంస్కృతిక జీవనంలో ప్రత్యేక స్థానముందని వివరించారు. దసరా సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలంతా ఒకేచోట గుమికూడి సామూహికంగా సంబురాలు జరుపుకోవటం సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శమని పేర్కొన్నారు.