- Advertisement -
ఎన్నికల కేంద్రాల్లో భద్రత, సదుపాయాల పరిశీలన
నవతెలంగాణ – బెజ్జంకి
రెండో విడత స్థానిక ఎన్నికల దృష్ట్యా మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో శుక్రవారం హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి తహసీల్దార్ శ్రీకాంత్ తో కలిసి పర్యటించారు. మండల కేంద్రంలోని బాలికల ప్రభుత్వోన్నత పాఠశాల, గుండారం, బేగంపేట, వడ్లూర్ గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఎన్నికల కేంద్రాలను ఆర్డీఓ క్షేత్ర స్థాయిలో సందర్శించి పరిశీలించారు. సమస్యాత్మక గ్రామాల్లోని ఎన్నికల కేంద్రాల్లో విద్యుత్, ప్రహరి గోడ, ఎన్నికల నిర్వహణ గదులను ప్రత్యేకంగా పరిశీలన చేసి శాంతియుతంగా ఎన్నికల నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్డీఓ తెలిపారు.
- Advertisement -



