- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
మండలంలోని టీజీ పల్లె గ్రామంలో భార్యాభర్తలు వార్డు సభ్యులుగా గెలిచి, భర్త ఉపసర్పంచ్ అయ్యాడు. డిజి పల్లె గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికల్లో భర్త మాడిశెట్టి విలాస్ ఏడవ వార్డ్ లో భార్య మాడిశెట్టి మౌనిక ఐదో వార్డుకు పోటీ చేసి గెలిచారు. దీంతో గెలిచినవాడు సభ్యులంతా కలిసి భర్త మాడిశెట్టి విలాస్ ను ఉపసర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారికి సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఉప సర్పంచ్ బిసి వర్గానికి చెందిన వాడు కావడంతో బీసీ మండల నాయకులు వారికి అభినందనలు తెలిపారు.
- Advertisement -



