- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఎన్నికల తీరును కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు .ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేపట్టాలని అన్నారు. సమయానికి ఎన్నికల ప్రక్రియను మొత్తం ముగించాలని పేర్కొన్నారు.
ఈ పోలింగ్ కేంద్రం తనిఖీలో బైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, ప్రత్యేక అధికారి సుదర్శన్, తహసిల్దార్ శ్రీలత, ఎంపీడీవో లవ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



