- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
అక్బర్ పేట్ భూంపల్లి మండల పరిధిలోని చౌదర్ పల్లికి చెందిన చుక్క సుస్మిత- ప్రశాంత్ దంపతుల కుమార్తె ‘ లోక్షిత’ 4 వ జన్మదినాన్ని పురస్కరించుకుని చిన్నారి తల్లిదండ్రులు మంగళవారం అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు గ్రామ సర్పంచ్ కొత్త నాగరాజు గౌడ్ చేతుల మీదుగా ఆటవస్తుల ను పంపిణీ చేశారు. అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో చిన్నారికి కేక్ కట్ చేయించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులను సర్పంచ్ నాగరాజు గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు.
- Advertisement -



