Wednesday, December 24, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రమాదవశాత్తు బావిలో పడ్డ వృద్ధుడు..

ప్రమాదవశాత్తు బావిలో పడ్డ వృద్ధుడు..

- Advertisement -

కాపాడిన పోలీసులు, ఫైర్ సిబ్బంది 
నవతెలంగాణ- దుబ్బాక 

పనిమీద దుబ్బాక కు వచ్చిన ఓ వృద్ధుడు.. కాల కృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు పక్కన ఉన్న ఓ బావి లో ప్రమాదవశాత్తు పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చేర్వాపూర్ 6 వ వార్డులో (దుబ్బాక – సిద్దిపేట రహదారి లోని) దేశాయి బీడీ కంపెనీ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు, దుబ్బాక ఎస్ఐ కే. కీర్తిరాజు, ఫైర్ ఆఫీసర్ కమలాకర్ తెలిపిన వివరాలు.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి కి చెందిన ఆర్ల శివరాజయ్య అనే వృద్ధుడు సొంత పని నిమిత్తం సోమవారం దుబ్బాక కు వచ్చాడు.

మంగళవారం తెల్లవారుజామున చేర్వాపూర్ వార్డు శివారులో కాలకృత్యాలు తీసుకునేందుకు వచ్చి నీళ్లు లేని పాడుబడ్డ బావిలో ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. కొంతసేపటి తర్వాత బావిలో నుంచి వృద్ధుడి అరుపులు విన్న స్థానిక రైతులు.. వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది బావిలోంచి వృద్ధుడిని జాగ్రత్తగా కాపాడి పైకి తీసుకొచ్చారు. 108 అంబులెన్స్ వాహనంలో దుబ్బాకలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. అనంతరం వృద్ధుడిని ఆయన స్వగ్రామానికి అంబులెన్స్ లో తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -