- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామంలోని దుబ్బ కాలనీలో వడ్డెర సంఘ భవన వద్ద షెడ్డు నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి ఎంపీ నిధుల నుంచి రూ.4 లక్షలు మంజూరు చేశారని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రామ్ రాజ్ గౌడ్ తెలిపారు. నిధులు మంజూరు కు సహకరించిన మాజీమంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి , ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి లకు సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు మెంబర్ లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కుల సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



