- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
టీపీసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు కాటారం డివిజన్ పర్యరణలో భాగంగా మండలంలోని కొయ్యుర్ సర్పంచ్ గా కొండ రాజమ్మ విజయం సాధించిన నేపథ్యంలో శనివారం రాజమ్మకు శ్రీనుబాబు శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాటారం మాజీ ఎంపిపి పంథకాని సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు మహేందర్, శ్రీనివాస్, రవి పాల్గొన్నారు.
- Advertisement -



