- Advertisement -
ఆర్ అండ్ బీ డి ఈ సునీల్
నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న తహసీల్దార్ భవనాన్ని సోమవారం ఆర్ అండ్ బీ డి ఈ సునీల్ పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. పనులను నాణ్యతతో చేపట్టి పది కలల పాటు ఉండేలా చూడలని సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ పనులను త్వరగా పూర్తి చేసి తహసీల్దార్ భవనాన్ని అందుబాటులో తీసుకురావాలనీ తెలిపారు. అదేవిదంగా మండలంలో పలు రహాదారుల టెండర్లు పూర్తయ్యాయని త్వరలోనే పనులను ప్రారంభిస్తామని అన్నారు. పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి నాణ్యత తో ఉండేలా చూస్తామని అన్నారు.
- Advertisement -



