నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని ప్రయివేటు ఆస్పత్రిలో రక్తహీనతతో చికిత్స పొందుతున్న సాగరిక అనే మహిళకు అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులను సంప్రదించడంతో కామారెడ్డి లో గల బి టాపర్ స్కూల్ డ్రైవర్ షేక్ అజీమ్ పాషా సహకారంతో వారికి ఓ పాజిటివ్ రక్తం సకాలంలో అందచేయడం జరిగిందనీ రక్తదాతల సేవా సమితి సర్వాకులు తెలిపారు. ఎప్పుడంటే అప్పుడు వచ్చి రక్తం ఇస్తూ సాటి మనిషి ప్రాణాలను కాపాడటంలో కామారెడ్డి రక్తదాతల సేవా సమితి రాష్ట్రంల్లోనే ఆదర్షంగా నిలుస్తుంది అన్నారు.
ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ యువత మానవత్వంతో స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని ఈ సందర్భంగా యువకులను కోరుతున్నామన్నారు. ఒక్క ఫోన్ కాల్ చేయగానే వచ్చి రక్తదానం చేసి కామారెడ్డి డ్రైవర్లకే ఆదర్శంగా నిలిచిన అజీమ్ ను జిల్లా రక్తధాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ లు అభినందించారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్ గుండెల్లి ప్రశాంత్, ప్రసాద్, పేషంట్ కుటుంబసభ్యులు , కెబిఎస్ బ్లడ్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
రక్తదానం చేసిన స్కూల్ బస్ డ్రైవర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



