- Advertisement -
మాజీ ఎంపీపీ మలహల్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ ఉద్యోగానికి పదవి విరమణ సహజమని మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో మండల సూపర్ డెంట్ గా ఉద్యోగ విరమణ చేస్తున్న గంటి శ్రీరామమూర్తి ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్నీ ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపిపి, సర్పంచ్లు బండి స్వామి, బండారి నర్సింగం హాజరై శాలువాలు, పూలమలతో సూపర్ డెంట్ దంపతులకు ఆత్మీయ సత్కారం చేశారు. ఉద్యోగానికి విరమణ పొందిన ప్రజాసేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు నాయక్, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది, ఎంపిడిఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



