- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మూడేళ్లకుపైగా జట్టుకు దూరమైన భువనేశ్వర్ కుమార్ను టీమ్లోకి తీసుకోవడానికి పరిశీలించాలని మాజీ స్టార్ వీరేంద్ర సెహ్వాగ్ సెలక్టర్లకు సూచించాడు. ఈ ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున అదరగొడుతున్న 36 ఏళ్ల భువీ 9 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీశాడు. భువీ సూపర్ ఫామ్ నేపథ్యంలో టీ20 టీమ్కు అతడిని పరిశీలించాలని సెహ్వాగ్ పేర్కొన్నాడు. అద్భుత ప్రదర్శనలు చేస్తున్న సమయంలో వయసు అనేది పెద్ద విషయం కాదన్నాడు.
- Advertisement -



