డాక్టర్ రాజేష్ కుమార్
నవతెలంగాణ-మిడ్జిల్
భారత కార్మిక చట్టాల రూప శిల్ప డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి అని, ఆయన ఆశలు అందరు కొనసాగించాలని పశువైద్య డాక్టర్ రాజేష్ కుమార్, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు శ్రీశైలం అన్నారు. శనివారం మండలంలోని మసిగుండ్లపల్లి గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ.మే డే సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని అన్ని వర్గాల ప్రజలు పిల్లలను చదువుపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు నరసింహ, చెన్నయ్య, యాదయ్య, చెన్నయ్య వెంకటయ్య, లాలు, శివ పవన్, తదితరులు పాల్గొన్నారు.
భారత కార్మిక చట్టాల రూపశిల్ప డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



