- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని ఘన్పూర్ (ఆర్) లో గల అంగన్వాడీలో మే నెలకు చెందిన టి హెచ్ ఆర్ ను స్థానిక సర్పంచ్ నాగులపల్లి రాజేందర్ లబ్ధిదారులకు అందజేశారు. మంగళవారం రాజేందర్ మాట్లాడుతూ…. అంగన్వాడీల ద్వారా కిషోర్ బాలులకు, బాలింతలకు, గర్భిణీలకు పౌష్టిక ఆహారం ప్రభుత్వం అందిస్తుందని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు వినియోగించుకొని ఆరోగ్య సమాజానికి బాటలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ రాజేశ్వరి, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



