నవతెలంగాణ హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఫలితాలు వెలువడిన తర్వాత పలుచోట్ల బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి కోల్ కతాలోని తృణమూల్ పార్టీ కార్యాలయం పైకి బుల్డోజర్ వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.అర్ధరాత్రి సమయంలో హాగ్ మార్కెట్ ప్రాంతంలోని టీఎంసీ న్యూమార్కెట్ యూనియన్ ఆఫీసు వద్దకు వచ్చిన కొందరు వ్యక్తులు.. బుల్డోజరుతో దాన్ని కూల్చేశారు. అత్యంత రద్దీ ప్రాంతంలో ఉన్నట్టుండి ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానిక దుకాణదారులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే తమ దుకాణాలు మూసేసి అక్కడినుంచి పారిపోయారు. ఈ ఘటనలో టీఎంసీ కార్యాలయం పూర్తిగా ధ్వంసం కావడం గమనార్హం.
తృణమూల్ కార్యాలయంపై బుల్డోజర్ దాడి.. అర్థరాత్రి హైటెన్షన్
- Advertisement -
- Advertisement -



