- Advertisement -
నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండలంలోని మాన్య నాయక్ గ్రామపంచాయతీ చౌటచెరువు తండా, లక్ష్మణ్ తండా గ్రామపంచాయతీ తువ్వబండ తండాలో తండావాసులు భక్తిశ్రద్ధలతో రెండు రోజులపాటు ఘనంగా జరుపుకున్నారు. తుల్జా భవాని ఉంచి తెల్లవారులు భక్తి పాటలతో అమ్మవారిని పూజించారు. ఈ ఏడాది కూడా పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హుసేని నాయక్, గిరిజన నాయకులు తారసింగ్, ఐటి శంకర్, రాజు, భీమ్లా నాయక్, తిరుపతి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



