Saturday, May 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రీడా మైదానాలు కరువు.!

క్రీడా మైదానాలు కరువు.!

- Advertisement -

క్రీడాకారులకు అందని ప్రోత్సాహం
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల క్రీడాకారులకు సరైన పోత్సాహం అందడం లేదు.గ్రామాల్లో క్రీడా మైదానం లేకపోవడంతో క్రీడల్లో రాణించలేకపో తున్నారు.మండలంలోని యువతీ, యువకులు క్రీడల కోసం ఎలాంటి మైదానం లేకపోవడంతో సెలవు దినాల్లోనే ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత,ప్రాథమిక పాఠశాలల్లో లేదా చెరువులను చదును చేసి మైదానంలోనే క్రీడలు నిర్వహించుకోవాల్సి వస్తుంది.పలుమార్లు అధికారులకు,ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు.గత ప్రభుత్వంలో ఉరికో క్రీడామైదానం తూతుమంత్రంగా ఏర్పాటు చేసిన అవి బోర్డులకే పరిమితం అయ్యాయి తప్పా ఒక్కటి కూడా వాడకంలో లేకపోగా చెత్త,చెదారం, ముళ్లపొదలతో నిండిపోయాయి 

ఏటా క్రికెట్,కబడ్డీ పోటీలు..
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్,ప్రాథమిక మైదాల్లో ప్రతీ ఏడాది మండల స్థాయి క్రికెట్, కబడ్డీ,నియోజకవర్గ స్థాయి క్రీడ పోటీలు నిర్వహిస్తున్నారు.అయితే పాఠశాల సెలవు దినాల్లో మాత్రమే నిర్వ హించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడా మైదానంతో పాటు క్రీడాకారుల సౌకర్యాలను నిర్వాహకులే ఏర్పాటు చేసుకున్నారు.ప్రతీ సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహణకు మండల క్రీడాకారులే తమ సొంత డబ్బులతో క్రీడా మైదానాన్ని చదును చేయించుకోని టోర్నమెంట్లు నిర్వహించుకుంటున్నామని చెబుతున్నారు.

వ్యాయామాలకు ఇదే దిక్కు..
మండల కేంద్రంలోని ప్రజలకు ఉదయం సాయంత్రం వ్యాయామాలు నిర్వహించుకునేందుకు ఎలాంటి మైదానం లేకపోవడంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలోనే వ్యాయామాలు చేసు కునేందుకు వస్తుంటారు.ఉదయం సాయంత్రం ప్రజలతో పాటు క్రీడాకారులు క్రీడలు ఆడుతుండటంతో క్రీడాకారులతో వ్యాయామం చేసుకునే ప్రజలకు, క్రీడాకారులకు ఇబ్బందులు తప్పడం లేదు.ఇప్పటికైనా అధికారులు స్పందించి మండ లానికి క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -