- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని పోసానిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల పనులను సర్పంచ్ సుద్దాల లింగం పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సౌకర్యార్థం మరుగుదొడ్లు నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గాండ్ర అంజయ్య, వార్డు మెంబర్లు సత్తవ్వ, సాయిలు, రాజేందర్, రాజమణి, లింగారెడ్డి, రూప పోచయ్య, గంగారం, శిరీష, నర్సింలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


