- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్(TG EAPCET-2026) ఎంట్రన్స్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 2.10లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రేపు ఉదయం 11 గంటలకు టీజీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. జేఎన్టీయూ హైదరాబాద్ (JNTUH) లోని గోల్డెన్ జూబ్లీ హాల్లో జరిగే కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఫలితాలను రిలీజ్ చేయనున్నట్లు ఈఏపీ సెట్ కన్వీనర్గా ప్రొఫెసర్ విజయకుమార్రెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
- Advertisement -



