Wednesday, May 20, 2026
E-PAPER
Homeజాతీయందేశవ్యాప్తంగా ఎండలు.. కేంద్రం కీలక హెచ్చరికలు జారీ

దేశవ్యాప్తంగా ఎండలు.. కేంద్రం కీలక హెచ్చరికలు జారీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. వడదెబ్బ, ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందడానికి ప్రజలు కోసం వివరణాత్మక మార్గదర్శకాలను ప్రకటించింది. తగినంత నీరు తాగడం, మధ్యాహ్న వేళల్లో నేరుగా ఎండ తగలకుండా చూసుకోవడం, లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం, సీజనల్ పండ్లు, ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉండే ద్రవాలు తీసుకోవడం వంటి సూచనలు ఇచ్చింది. కళ్ళు తిరగడం, తలనొప్పి, వాంతులు, స్పృహ తప్పడం వంటి లక్షణాలను తీవ్రమైనవిగా గుర్తించి, తక్షణ వైద్య సహాయం పొందాలని సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -